కిక్ రైటర్ ఈసారైనా హిట్ కొడతాడా?


కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ఎవడు, టెంపర్, అఖిల్ ఏజెంట్ ఇలా విభిన్నమైన కథలతో ఇండస్ట్రీలో కథ రచయితగా మంచి క్రేజ్ అందుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా కూడా తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అసలైతే మొదట ఈ రైటర్ ఎన్టీఆర్ తో డైరెక్టర్ గా పరిచయం అవ్వాల్సింది.

కానీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం వంశీకి మరో హీరో దొరకడానికి చాలా టైమ్ పెట్టింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు నితిన్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమాను ఆదివారం లాంచ్ చేశారు. నితిన్ హోమ్ బ్యానర్ లో రూపొందుతున్న ఆ సినిమాతో అయినా మనోడు హిట్ అందుకుంటాడో చూడాలి. ఇక హరిస్ జై రాజ్ స్పైడర్ అనంతరం చేస్తున్న సినిమా ఇదే. అథానికి కూడా ఈ మూవీ చాలా కీలకం కానుంది.

Post a Comment

Previous Post Next Post