రజినీ ఫ్లాప్ సినిమాల వల్లే.. దిల్ రాజుకి జాక్ పాట్


సూపర్‌స్టార్ రజనీకాంత్ గత మూడు చిత్రాలు, “పేట,” “దర్బార్,” మరియు “అన్నాత్తే” బాక్సాఫీస్ వద్ద నష్టాలను కలుగజేశాయి. ప్రతి  చిత్రానికి కలెక్షన్ తగ్గుతూ వచ్చయు. ఇక తెలుగులో “పెద్దన్న”గా విడుదలైన “అన్నాత్తే” ముఖ్యంగా పేలవమైన ఫలితాలను సాధించింది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. 
ఆ సినిమా ప్రదర్శన రజనీకాంత్‌కు దురదృష్టకరం అయితే, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మరియు ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్‌లకు ఇది సానుకూలమైన పరిస్థితి తెచ్చిపెట్టింది. 

సాధారణంగా ఒక హీరో యొక్క తదుపరి చిత్రం యొక్క వ్యాపారం వారి మునుపటి సినిమా ఫలితం ద్వారా ఆధారపడి ఉంది. ఇక “పెద్దన్న” చిత్రానికి అండర్ రెస్పాన్స్ రావడం వలన “జైలర్” తెలుగు థియేట్రికల్ హక్కులు కేవలం రూ. 12 కోట్లకు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సినిమా హక్కులను దిల్ రాజు ఏషియన్ సునీల్ నారాయణ ఇద్దరు కలిపి 12 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక సినిమా ఇప్పుడు తెలుగులో పెట్టిన పెట్టుబడిని మొత్తం వెనక్కి తీసుకురావడమే కాకుండా మళ్ళీ బోనస్ గా మరొక 25 కోట్లకు పైగానే లాభాలు తెచ్చిపెడుతోంది. లెక్క ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. గతంలో రజనీకాంత్ సినిమాతో బిజినెస్ చేసిన వారికి తీవ్రంగా నష్టం రాగా ఈసారి దిల్ రాజు సునీల్ అదృష్టంతో జాక్ పాట్ కొట్టేశారు అని చెప్పాలి.

Post a Comment

Previous Post Next Post