ఏప్రిల్ 10న మైత్రి మూవీ మేకర్స్ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేశారు. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, సన్నీ డియోల్ హీరోగా వచ్చిన జాట్. తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలు గ్రాండ్ గానే విడుదలైనప్పటికీ, ఎపి - తెలంగాణలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడులో ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైపోయింది. దాంతో మైత్రి బాగానే మేనేజ్ అయింది. కానీ జాట్ మాత్రం భారీ నష్టాల బాట పట్టినట్లు సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి విడుదల చేసిన ఈ సినిమా మొదటి రోజు ఓకే రేంజ్లో నడిచినా… ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, జాట్ సినిమాతో మైత్రికి రూ.60-70 కోట్ల మధ్య నష్టం వస్తుందని టాక్. ఈ నేపథ్యంలోనే జాట్ 2 అనౌన్స్మెంట్ని ప్రచార ఉద్దేశంతో చేసారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. తుది రన్లో వసూళ్లు పెరగడం అసాధ్యమేనని ట్రేడ్ అంటోంది. ఇటీవల పుష్ప 2 సినిమాతో మైత్రికి భారీ లాభాలు వచ్చినా… బాలీవుడ్, కోలీవుడ్లో వేసిన ప్లాన్స్ పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం మైత్రి తెలుగు సరహద్దులు దాటి సినిమా చేస్తోంది కానీ లాభం కన్నా రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది.
Follow
Post a Comment