Manam Director Sequel plans!!


2009లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 13బి సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఇష్క్, మనం, 24 లాంటి సినిమాలతో డిఫరెంట్ గా అడుగులు వేశాడు. అయితే అతనికి ఎంతగానో ఇష్టమైన హారర్, త్రిల్లర్ కాన్సెప్ట్ వైపు మళ్ళీ వెళ్లలేదు. ఇక చాలా కాలం తరువాత అటువైపుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్యతో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత మళ్ళీ చైతూతోనే ఒక వెబ్ సీరీస్ ను స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఆ కాన్సెప్ట్ హారర్, త్రిల్లర్ జానర్ లోనే రానుందట. దీంతో 13బి సీక్వెల్ ప్లాన్ చేశాడా అనే రూమర్స్ వస్తున్నాయి. గతంలోనే 13 సీక్వెల్ పై అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. విక్రమ్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయట. అయితే సీక్వెల్ పై ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. మరి ఇప్పుడు నాగచైతన్యతో తీస్తున్న సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.



Post a Comment

Previous Post Next Post