Buzz: ప్రభాస్ సినిమాలో మరో ఇద్దరు హీరోలు!


రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లోనే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమైంది.

ఇక సినిమాలో ఇద్దరు యువ హీరోలు కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.  అయితే ఆ వార్తలు రావడానికి గల కారణం లేకపోలేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాలో మరో రెండు కీలకమైన పాత్రల కోసం స్టార్ ఇమేజ్ ఉన్న యువ హీరోలను తీసుకోవాలని అనుకుంటున్నాడట. అందులో భాగంగానే నాని, విజయ్ దేవరకొండ లను సంప్రదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ స్టార్స్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో నటించారు. అలాగే విజయ్ దేవరకొండ మహానటి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్ లాంటి బడా స్టార్ సినిమాలో నాని విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post