2022లో రకుల్ జోరు.. ఒకేసారి ఏడు సినిమాలు!


నటి రకుల్ ప్రీత్ సింగ్ 2022 సంవత్సరానికి ఏడు భారీ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధాంగా ఉంది. వాటిలో ఒక తెనుగు మూవీతో పాటు ఆరు హిందీ సినిమాలు ఉండడం విశేషం. బాలీవుడ్‌లో డాక్టర్ జి, అమితాబ్ బచ్చన్ & అజయ్ దేవగన్‌లతో 'రన్‌వే 34' - అజయ్ దేవగన్ & సిద్ధార్థ్ మల్హోత్రాతో 'థ్యాంక్ గాడ్' - 'చత్రీవాలి', 'ఎటాక్' మరియు అక్షయ్ కుమార్‌తో మరో సినిమా చేయనుంది.

ఇక తన తదుపరి సినిమాల గురించి రకుల్ ఇటీవల ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. “2022 నా అత్యుత్తమ సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అంటూ.. ఎందుకంటే 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని.. వీలైనంత త్వరగా ఆ సినిమా పనులన్నిటిని ఫినిష్ చేస్తానని వివరణ ఇచ్చింది. ఇక తెలుగులో ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రావడం లేదు. చివరగా చేసిన చెక్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post