దిల్ రాజు 'వారసుడు' టెన్షన్.. అల్లు అరవింద్ ఒక్కటే మాట

దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమాకు వచ్చే సంక్రాంతికి ఎక్కువ స్థాయిలో థియేటర్స్ లభిస్తాయా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహా రెడ్డి భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. అలాగే అజిత్ తనివు కూడా రానుంది. ఇక ఇదివరకే నిర్మాతల మండలి డబ్బింగ్ సినిమాలకు ఫెస్టివల్స్ సమయంలో ప్రాధాన్యత ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది.


అయితే ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ ఆ కాంట్రవర్సీ విషయంలో ఓకే ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు. ఈ డబ్బింగ్ సినిమాలను పండుగకు విడుదల చేయవచ్చా లేదా వాటి విడుదలలు ఆగిపోతాయా అని అడిగినప్పుడు, “అది జరిగే పని కాదు” అని ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చాడు. అంటే వారసుడు సినిమా సంక్రాంతి టైమ్ లో బిగ్ రిలీజ్ కు నోచుకునే అవకాశాలు లేవని అనిపిస్తోంది. మరి దిల్ రాజు ఈ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి.

1 Comments

Post a Comment

Previous Post Next Post