టాలీవుడ్ లో మరో విషాదం

 

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది మహానటి సావిత్రి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమంలో మరో మంచినీటిగా మరో స్థాయికి ఎదిగిన వారిలో జమున ఒకరు. ఇటీవల 86వ పుట్టినరోజు జరుపుకున్న జమున వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు.


1953లో జమున పుట్టిల్లు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఇక ఎల్వీ ప్రసాద్‌ తెరకెక్కించిన ఎన్టీఆర్ మిస్సమ్మ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణలాంటి ప్రముఖ హీరోలందరితోనూ జమున సినిమాలు చేశారు. తెలుగులోనే కాదు, తమిళ్‌, కన్నడ, హిందీ ల్లో నటించారు జమున. ఇక మహానటి సావిత్రికి ఆమె మంచి స్నేహితురాలు. ఇక జమున మరణించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటిస్తున్నరు.

Post a Comment

Previous Post Next Post