KGF Director another Deal with Prabhas!!


టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో అలరించనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేయక తప్పడం లేదు. ఇక ఆ తరువాత సలార్ తో రానున్న విషయం తెలిసిందే.

KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అయితే ఇటీవల డైరెక్టర్ పని తనానికి ప్రభాస్ ఫిదా అయ్యాడట. షూటింగ్ ను త్వరగా పూర్తి చేస్తూనే చాలా క్వాలిటీగా చెప్పినట్లుగానే షూట్ చేస్తున్నాడని డార్లింగ్ షాక్ అవుతున్నాడట. దీంతో ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అనంతరం ప్రశాంత్ తో మరో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు తెరకెక్కించబోయే ఆ పాన్ ఇండియా సినిమా 2024లో సెట్స్ పైకి రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post