అలా చేస్తే స్టార్ డమ్ లు ఉండవు.. ఓటీటీలపై ఎర్రన్న కన్నెర్ర!


విజయవాడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై తనదైన శైలిలో ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవల ఓటిటి లో వచ్చిన నారప్ప సినిమాను తెలుగు రాష్ట్రాలలో  కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారు. పేద వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఓటీటీ అంటే ఏమిటో తెలియదు. 75 శాతం మంది చూడలేకపోయారు. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదం అని అన్నారు.

ఇక సినిమా థియేటర్ లో సినిమా చూడడం ఒక పండుగ. థియేటర్ అనుభూతే వేరు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపి ఏమిటంటే వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని కోరుతున్నాను.
కరోనా తో ఫైట్ చెయ్యాల్సిందే అందరూ.  పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం థియేటర్ . సినిమా బతకాలి థియేటర్స్ బతకాలి, సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలి. మనిషి వున్నంత కాలం థియేటర్ వుంటుంది. థియేటర్ లేకపోతే స్టార్ డమ్ లు వుండవు. పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓ టి టి కి రిలీజ్ చెయ్యకుండా థియేటర్ లో రిలీజ్ అయ్యేటట్టు చూడాలి అని కోరారు.

Post a Comment

Previous Post Next Post