NTR30ను కాదని రామ్ చరణ్ కు గ్రీన్ సిగ్నల్!


పాన్ ఇండియా సినిమాల హడావిడి రోజురోజుకు గట్టిగానే పెరుగుతోంది. హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వారి క్రేజ్ ను అమాంతంగా పెంచేసుకుంటు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం కీయరా అద్వానీ అదృష్టం చాలా బాగా వర్కౌట్ అవుతోంది. ఈ బ్యూటీ మొదటి నుంచి కూడా సౌత్ సినిమాలను కాదనకుండా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

ఓ వైపు బాలీవుడ్ లో పెద్ద ఆఫర్స్ వస్తున్నా కూడా అమ్మడికి టాలీవుడ్ ఆఫర్స్ వస్తే ముందు కథలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను కాదని రామ్ చరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన కీయరా అంతకు ముందే కొరటాల శివ NTR30 కథను వినింది. అయితే ఎదో ఒక్క సినిమాను మాత్రమే ఓకే చేసే అవకాశం ఉండడంతో అమ్మడు శంకర్ సినిమా వైవు యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post