డిజాస్టర్ డైరెక్టర్ తో దేవరకొండ పాన్ ఇండియా?


విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లైగర్ సినిమాను పూర్తి చేసిన విజయ్ మళ్ళీ పూరి జగన్నాథ్ తోనే జనగణమన అనే మరో ప్రాజెక్ట్ ను కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఖుషి సినిమాను స్టార్ట్ చేశాడు.

అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ నిర్మాత ఇటీవల V దర్శకుడిని విజయ్ కోసం కథను సెట్ చేయించినట్లు టాక్. కథపై విజయ్ పాజిటివ్ గానే స్పందించినట్లు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి మంచి దర్శకుడే అయినప్పటికీ అతని చివరగా డైరెక్ట్ చేసిన V సినిమా ఓటీటీలో కూడా డిజాస్టర్ టాక్ ను సోంతం చేసుకుంది. చిన్న సినిమాల వరకే అతని మ్యాజిక్ వర్కౌట్ అవుతోంది. మరి విజయ్ తో ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post