బాలీవుడ్లో యాక్షన్కు సింబల్గా నిలిచిన ధూమ్ ఫ్రాంచైజ్ మళ్లీ కొత్త భాగంతో రాబోతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పటికే రణ్బీర్ కపూర్ని ఫైనల్ చేసి, మరో కో స్టార్ కోసం వెతుకుతోంది. ఈసారి టాలీవుడ్ నుంచి ఒక స్టార్ని తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకెళ్లినా, ఆ స్టార్ మాత్రం ఆఫర్ని సున్నితంగా తిరస్కరించాడని ఇండస్ట్రీ టాక్.
బాహుబలి తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి తెలుగు హీరోలు నేషనల్ రేంజ్లోకి వెళ్లారు. తాజాగా తారక్ వార్ 2లో హృతిక్ రోషన్తో కలిసి నటించాడు. అయితే ఆ సినిమా ఫలితంపై మిశ్రమ స్పందనలు రావడంతో, ధూమ్ 4లో భాగమైతే అదే తరహా రిస్క్ అవుతుందని ఆ స్టార్ భావించినట్టు చెబుతున్నారు. స్పై స్టోరీలాంటిది కాకుండా ధూమ్ మాత్రం థీఫ్ స్టోరీ. అయినా కూడా ఆ ఆఫర్ని వదులుకోవడమే సరైన నిర్ణయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తెలుగు స్టార్ పేరు బయటపడకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక బాలీవుడ్లో అవకాశాల కోసం కాకుండా, బాలీవుడ్ స్టార్స్ని టాలీవుడ్ ప్రాజెక్టులకి రప్పించడం మంచిదనే అభిప్రాయం బలపడుతోంది. రాబోయే రోజుల్లో అలాంటి క్రాస్ ఓవర్ కాంబినేషన్స్ పెద్ద స్థాయిలో చూడొచ్చు. అప్పుడు మాత్రమే ఆడియన్స్కి అసలైన ట్రీట్ దక్కుతుంది.
Follow

Post a Comment