Type Here to Get Search Results !

శేఖర్ కమ్ముల.. స్కామ్ థ్రిల్లర్!

 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఏషియన్ సునీల్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కొన్ని నిజ జీవితంలోనే సంఘటనలు ఆధారంగా తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియాలో జరిగిన అతిపెద్ద స్కాం నేపథ్యంలో ఈ సినిమా అసలు కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఆ కథలోనే ఒక లవ్ స్టొరీ కూడా ఉంటుందట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. దర్శకుడు పూర్తిగా ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న తర్వాతనే సినిమా చేయడానికి ధనుష్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం ధనుష్ రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. శేఖర్ మొదటిసారి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక కథకు తగ్గట్లుగా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఒక బలమైన విలన్ కనిపిస్తారని సమాచారం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies